తెలంగాణ రైతు గోస బీజేపీ పోరుదీక్ష - కట్ట మహేష్ బీజేపీ అధ్యక్షులు

Published: Tuesday May 25, 2021
గొల్లపల్లి, మే 24 (ప్రజాపాలన ప్రతినిధి) : ​గొల్లపెల్లి మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్  పిలుపు మేరకు తెలంగాణ రైతు గోస బిజెపి పోరు దీక్ష దీక్షను మండల అధ్యక్షులు కట్ట మహేష్ కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ తన ఇంటి వద్ద రైతులకు మద్దతు గా దీక్ష చేశారు. కట్ట మహేష్ మాట్లాడుతూ అసలు ప్రభుత్వం ఉందా ఉంటే రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దుఏడ్చిన ఏవుసం అని ఎన్నోసార్లు మాట్లాడినా మీరు చేస్తున్నదేమీ ఏ నాటికి ఈ విధానం సరి కాదన్నారు రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనాలని అకాల వర్షాలతో తడిసిన రంగుమారిన ధాన్యం కూడా కొనాల్సిందే తప్ప తాలు, తరుగు పేరుతో  రైస్ మిల్లర్లు చేస్తున్న ఢోకా రైతుల కన్నీరు ఊరికే పొదు ఆరుగాలం శ్రమించారు మరిదేన రైతు ప్రభుత్వం రైతుల వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ​రైతు బంధు నిధులను వెంటనే రైతుల ఖాతాలలో జమ చేయాలి తక్షణమే రైతులందరి రుణాలను మాఫీ చేయాలని డిమాండ్చేస్తూ వట్టిమాటలు కట్టిపెట్టి ​రైతుసమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనియెడల రానున్న రోజుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నాయకత్వంలో తమ నిరసనను మరింత ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు..