బీజేపీ విజయసంకల్ప సభకు తరలిన కార్పోరేటర్ శ్రీవాణి వెంకట్ రావు

Published: Monday July 04, 2022
మేడిపల్లి, జులై 3 (ప్రజాపాలన ప్రతినిధి)
 సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజయ సంకల్ప భారీ బహిరంగ సభకు తెలంగాణ రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు, ఉప్పల్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఆదేశానుసారం రామంతపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు  ఆధ్వర్యంలో రామంతపూర్ డివిజన్ 39 బూతుల నుండి 13 శక్తి కేంద్రాల ఇన్చార్జి లు 600 మంది కార్యకర్తలతో రామంతపూర్ డివిజన్ సీనియర్ నాయకులు, నాయకురాలు, మోడీ అభిమానులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.