"కాకా" ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణి

Published: Tuesday June 08, 2021

బెల్లంపల్లి, జూన్ 7, ప్రజాపాలన ప్రతినిధి : కరోణా కష్టకాలంలో లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ శ్రీ.జీ.వెంకట స్వామి "కాకా" ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ బిజెపి రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు జి.వివేక్ వెంకటస్వామి సహకారంతో సోమవారం కాసిపేట మండలంలోని కాసిపేట, ముత్యంపల్లి, చిన్న ధర్మారం, ఎస్సీ కాలనీ, గ్రామాలలోని 40 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు మంచిర్యాల జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి మునిమంద రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ బిజెపి అధ్యక్షులు కోడి రమేష్, బెల్లంపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి రాచర్ల సంతోష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సబ్బని రాజనర్సు, తాండూర్ మండల ఇన్ఛార్జ్ రేవెళ్లి రాజలింగు, జిల్లా ఎస్ సి మోర్చా ఉపాధ్యక్షులు ఎరుకల శ్రీనివాస్, సీనియర్ నాయకులు దుడపాక బలరామ్, కిసాన్మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు అటుక పురం రమేష్, సూరం సంపత్, బాకి నరేష్, బాకి కిరణ్, కంబాల అరవింద్, పోల బోయిన పోషమ్, తదితరులు పాల్గొన్నారు.