మైనర్ బాలికను హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి

Published: Tuesday March 29, 2022
వికారాబాద్ నియోజకవర్గ బిఎస్పి అద్యక్షులు క్రాంతి కుమార్
వికారాబాద్ బ్యూరో 28 మార్చి ప్రజాపాలన : మైనర్ బాలికను హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని వికారాబాద్ నియోజకవర్గ బిఎస్పి అద్యక్షులు క్రాంతి కుమార్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా పుడూర్ మండలం అంగడి చిట్టెంపల్లి గ్రామానికి చెందిన బాలిక హత్యకు గురికావడం దారుణమని విచారం వ్యక్తం చేశారు. బాలిక హత్యకు గురికావడం చూస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత బలహీనంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించి నిందితుడిని పట్టుకొని బాలిక కుటుంబానికీ న్యాయం చేయాలని వికారాబాద్ నియోజకవర్గ బిఎస్పి అధ్యక్షులు క్రాంతి కుమార్ డిమాండ్ చేశారు.