అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
Published: Tuesday December 07, 2021
కోరుట్ల, డిసెంబరు 06 (ప్రజాపాలన ప్రతినిధి): కోరుట్ల మండలం జోగన్ పల్లి గ్రామం లో డా" బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 65 వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దుంపల నర్సు రాజ నర్సయ్య మాట్లాడుతూ అంబేడ్కర్ గారు అనాడు ఎన్నో అవమానాలు ఎదురుకొని, ఉన్నతమైన చదువులు చదివి భారత దేశానికి రాజ్యాంగము రాశారు. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన రాసిన రాజ్యాంగ శాసనాలు ఇప్పటికీ భారత దేశన్ని పరిపాలిస్తున్నాయి, ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా అంబేడ్కర్ గారి ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బద్ధం తిరుపతి రెడ్డి, మహిపాల్ రెడ్డి, సంజీవ్, రాజశేఖర్, ఉదయ్ కిరణ్, హరీష్, అశోక్, రమేష్, రాజేశం, సంతోష్, శంకర్, వివిధ కుల సంఘాల నాయకులు,అంబెడ్కర్ సంఘం నాయకులు, యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Share this on your social network: