నేడు పెట్రోల్ బంకుల ముందు నిరసన కార్యక్రమాలు

Published: Friday June 11, 2021

జన్నారం, జూన్ 10, ప్రజాపాలన ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరల కు నిరసనగా నేడు మండల కేంద్రంలో గల పెట్రోల్ పంపుల ముందు నిరసన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పసి ఉల్ల తెలిపారు. గురువారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు ప్రతిరోజు  పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతూనే పోతుందన్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ సకాలంలో హాజరై నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బోర్లకుంట ప్రభుదాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.