మెడికల్ కళాశాలను ఏర్పాటు కోసం పాదయాత్ర

Published: Wednesday June 23, 2021

బెల్లంపల్లి, జూన్ 22, ప్రజాపాలన ప్రతినిధి : మంచిర్యాల జిల్లాకు మంజూరైన మెడికల్ కళాశాలను బెల్లంపల్లి లోనే ఏర్పాటు చేయాలని ఏర్పాటైన మెడికల్ కళాశాల సాధన కమిటీ వివిధ కార్యక్రమాలు రూపొందించి ముందుకు పోతుంది. ఇందులో భాగంగా మంగళవారం నాడు బెల్లంపల్లి పట్టణంలో పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు, స్థానిక అగర్వాల్ భవన్ నుండి చేపట్టిన పాదయాత్ర కార్యక్రమం గతంలో కెమికల్ ఏరియాలో ఆగిపోయిన మెడికల్ కళాశాల భవనాల వరకు కొనసాగించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం మెడికల్ కళాశాలను బెల్లంపల్లి పట్టణంలో నిర్మించేవరకు మా పోరాటం ఆగదని ప్రతి రోజు ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నిరసనను ప్రభుత్వానికి తెలియజేస్తామని అప్పటికి కూడా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే రాష్ట్ర రాజధాని హైదరాబాదులో కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగడానికి సిద్ధంగా ఉన్నామని వారు హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణంలోని అన్ని పార్టీల నాయకులు, యువకులు విద్యార్థులు, ప్రజలు, వ్యాపారస్తులు, పాల్గొని విజయవంతం చేశారు.