హస్తం గూటికి చేరిన ధారూర్ మండల టిఆర్ఎస్ నాయకుడు
Published: Saturday July 30, 2022
మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పట్లోళ్ల రఘువీరారెడ్డి
వికారాబాద్ బ్యూరో 29 జూలై ప్రజా పాలన : ప్రజల కష్ట సుఖాలను అడుగడుగున తెలుసుకుంటూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ధరూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పట్లోళ్ల రఘువీరారెడ్డి సంయుక్తంగా అన్నారు. శుక్రవారం ధారూర్ మండల టీఆర్ఎస్ యువజన విభాగం మాజీ అధ్యక్షుడు తిరుపతి గారి మల్లేశం హస్తం గూటికి చేరడం అభినందనీయమని కొనియాడారు. టీఆర్ఎస్ మండల యువజన విభాగం మాజీ అధ్యక్షుడు తిరుపతి గారి మల్లేశంతో పాటు రాము గౌడ్ ,చారి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బుజ్జయ్య గౌడ్ రఘుపతి రెడ్డి లక్ష్మణ్ అశోక్ ముదిరాజ్ సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు
Share this on your social network: