అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి-సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
Published: Friday July 15, 2022
జగిత్యాల,జూలై 14 (ప్రజాపాలన ప్రతినిధి): గతవారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలతో నెలకొన్న తాజా పరిస్థితులపై జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, జెడ్పీ ఛైర్ పర్సన్ దావ వసంతసురేష్ లతో కలిసి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, స్థానిక ప్రజా ప్రతినిధుల సహాయం తీసుకొని సహాయ కార్యక్రమాలు నిర్వహించాలని సూచనలు చేశారు. ఈ సమావేశంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: