జాతీయ సమైక్యత ర్యాలీ ప్రారంభించిన ఎంపి వెంకటేష్ నేత

Published: Saturday September 17, 2022
మంచిర్యాల టౌన్, సెప్టెంబర్ 16, ప్రజాపాలన: జాతీయ సమైక్యత ర్యాలీని మంచిర్యాల జిల్లా కేంద్రంలో  స్థానిక శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు తో కలిసి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత జెండా ఊపి ర్యాలి ప్రారంభించారు. ఈ  సదర్భంగా ఎంపి  మాట్లడుతూ 1947 ఆగస్టు 15న భారతదేశినికి స్వాతంత్రం వచ్చిందని, 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానాన్ని స్వాతంత్ర భారత దేశంలో విలీనం చేయడం జరిగిందన్నారు. డాక్టర్   అంబేద్కర్  రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను  నెరవేరిందని అన్నారు. దేశ  ప్రజందరు జాతీయ సమైక్యత ను కలిగి ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య , మున్సిపల్ కమిషనర్, డిసిపి అఖిల్ మహాజన్, పోలీస్ శాఖ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area