గుంతలమయమైన బోనకల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి
Published: Tuesday January 10, 2023
బోనకల్, జనవరి 9 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రమాదాలకు నిలయంగా మారింది. భారీ వాహనాలు కారణంగా రోడ్డంతా గుంతలమయమై ఇనుప చూవ్వలు పైకి తేలాయి. గుంతల్లో నీరు చేరడంతో వాహ నదారులు అందులో పడి ప్రమాదాలకు గురవుతు న్నారు. రాత్రి వేళల్లో ఈ ఫ్లై ఓవర్ మీదుగా ప్రయాణిం చాలంటే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.గుంతలు కనబడ గానే వాహనదారులు సడెన్ బ్రేక్ వేయడం వల్ల వెనుక నుంచి వచ్చే వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫ్లైఓవర్ బ్రిడ్జిపై కాంక్రిట్ చెదిరి పోయి ఇనుప రాడ్లు పైకి తేలినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిత్యం వందలాది భారీ వాహనాలు, ట్రక్కులు, కంటేయినర్లు, లారీలు బోనకల్ మీదుగా తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటాయి. వాటితో పాటు నిత్యం కార్లు, ఆటో లు, ద్విచక్ర వాహనాలతో ఫ్లైఓవర్ బ్రిడ్జి రద్దీగా ఉంటుంది. నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రస్తుతం పెరిగిన రద్దీకి గుంతల మయమై ప్రమాదాలు చోటు చేసు కుంటున్నాయి.వాహనాల రద్దీ దృష్ట్యా ప్రమాదాలు తగ్గి ట్రాఫిక్ జాం ఏర్పడకుండా ఉంటుందని ప్రజలు కోరుతున్నారు. ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఏర్పడిన గుంతలకు శాశ్వత మరమ్మతు చేయాలని, ప్రమా దాలతోపాటు వాహనాలు పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫైవ్ ఓవర్ పై గుంతల మయమై తరచూ ప్రమాదాలు....
ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఉన్న గుంతల సమస్యను ఆర్అండ్బీ శాఖ దృష్టికి మండల పరిషత్ సమావేశంలో ఆర్ అండ్ బి అధికారులకు ప్రజా ప్రతినిధులు ఎన్నోసార్లు విన్నవించుకున్నారు. కానీ ఆర్ అండ్ బి అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల గుంతలకు ఎర్ర మట్టితో గుంతలు పూడ్చారు తప్ప శాశ్వతంగా మరమ్మత్తులు చేపట్టడం లేదు. చేసిన ప్యాచ్ వర్క్ దెబ్బతిని మళ్ళీ గుంతలు ఏర్పడ్డాయి. పెరిగిన భారీ వాహనాల వల్ల అధికంగా గుంతలు ఏర్పడి ఫ్లై ఓవర్ పై విద్యుత్ లైట్లు లేకపోవడం వలన తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతినిత్యం ఆర్ అండ్ బి అధికారులు ఏర్పడిన గుంతలను చూస్తున్నారు తప్ప మరమ్మత్తులు చేపట్టడం లేదు. ఎదు రెదురుగా వచ్చే వాహనాలు గుంతలను తప్పించబోయి ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఏర్పడిన గుంతలను వెంటనే మరమ్మతు చేపట్టాలని ఆర్ఆండ్బీ శాఖ అధికారులను పలువురు వేడుకుంటున్నారు.
Share this on your social network: