పైనంపల్లి గ్రామం వద్ద అండర్ గ్రౌండ్ ఇచ్చి ప్లైఓవర్ నిర్మించాలని యూత్ కాంగ్రెస్ నాగరాజు...

Published: Friday December 09, 2022
పాలేరు డిసెంబర్ 8 ప్రజాపాలన ప్రతినిధి
నేలకోండపల్లి 
మండల పరిధిలోని పైనంపల్లి గ్రామంలో నిర్మిస్తున్న జాతీయ రహదారి లో భాగంగా చుట్టు గ్రామాల ప్రజల సౌకర్యార్థం అండర్ గ్రౌండ్ నిర్మించి ప్లైఓవర్ నిర్మించాలని నేలకోండపల్లి మండల యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు యడవల్లి నాగరాజు డిమాండ్ చేశారు.రామచంద్రపురం,బోదులబండ,మండ్రాజుపల్లి,చెన్నారం,మధుకాన్ షుగర్ ఫ్యాక్టరీ,జక్కేపల్లి కి సంబంధించిన రహదారి నిర్మాణం ఉన్నందున సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన ప్రజలు వెళ్ళేందుకు సౌకర్యంగా పైనంపల్లి వద్ద ప్లైఓవర్ నిర్మించాలని వారు కోరారు.ఈ రోడ్డు పై ప్లైఓవర్ నిర్మించకపోతే ఆయా గ్రామల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వెల్లడించారు.ఆయా గ్రామల ప్రజలు సౌకర్యార్థం తక్షణమే నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.