ప్రభుత్వ అధికారిపై దాడి చేసిన ఎమ్మెల్యే ను కఠినంగా శిక్షించాలి : ఎంజపి టిఎస్ యుటిఎఫ్ విభాగం

Published: Thursday November 24, 2022

బోనకల్, నవంబర్ 23 ప్రజా పాలన ప్రతినిధి: మహాత్మా జోతిరావు ఫూలేతెలంగాణ బిసి సంక్షేమ గురుకుల విద్యాసంస్థల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా (ఇన్ చార్జి) ఆర్సీఓ, నాగర్ కర్నూలు కళాశాల ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి పై గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి దౌర్జన్యాన్ని టిఎస్ యుటిఎఫ్ బోనకల్ మండల శాఖ ఎంజెపి గురుకుల ఉపాధ్యాయుల విభాగం పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. విధినిర్వహణలో ఉన్న ప్రభుత్వ అధికారిపై చొక్కా పట్టుకుని భౌతిక దాడికి దిగటంతో పాటు అనాగరిక భాషలో దుర్భాషలాడిన ఎమ్మెల్యే పై కేసునమోదు చేసి కఠినంగా శిక్షించాలని , ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగులను కాపాడాల్సిన గౌర ప్రజాప్రతినిధి అలా ప్రవర్తించడం అనాగరిక చర్య అన్ని అన్నారు. టీఎస్ యుటిఎఫ్ బోనకల్ మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ప్రీతం, జి రామకృష్ణ ,ఎంజెపి టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర సబ్ కమిటీ , కో- కన్వీనర్ టి లివిన్ స్టన్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ గురుకుల ఉపాధ్యాయులు భవాని, శివకృష్ణ ,అన్నమనాయుడు, ప్రవల్లిక ,రవీందర్, ఎం కృష్ణ, ఎం వెంకటేశ్వర్లు, జే వెంకటేశ్వర్లు, నరేష్, రాంబాబు ,అశోకు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.