ఆర్యవైశ్య కార్పొరేషన్ సమావేశాన్ని జయప్రదం చేయండి

Published: Saturday October 02, 2021
మధిర, అక్టోబర్ 01, ప్రజాపాలన ప్రతినిధి : నిరుపేద ఆర్యవైశ్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్యవైశ్య కార్పొరేషన్ ను 1000 కోట్లతో పూర్తి చట్టబద్ధత తో తక్షణమే ఏర్పాటు చేయాలని ది 03 10 2021 న ఆదివారము నాడు ఖమ్మం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం గుట్టల బజార్ నందు ఏర్పాటుచేసిన ఖమ్మం జిల్లా స్థాయి కార్యాచరణ సమావేశానికి జిల్లాలో ఉన్న ఆర్యవైశ్యులు అందరూ కదలిరావాలని ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన సమితి అధ్యక్షులు కుంచం కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ఆంధ్ర ప్రదేశ్ దేశ్ వైసిపి నాయకులు పోతుల సురేష్ టి పి సి సి అధికార ప్రతినిధి కాల్వ సుజాత ఏ సి పి ఎస్ జాతీయ అధ్యక్షులు ప్రేమ్ గాంధీ మిర్యాలగూడెం మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు బుస్సా శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మహిళా అధ్యక్షురాలు ఉప్పల శారద బిజెపి ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి  దేవకి వాసుదేవరావు ఆంధ్ర ప్రదేశ్ టిడిపి నాయకులు అర్వపల్లి ఆంజనేయులు మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరు నగిరి భార్గవ్ తదితరులు హాజరుకానున్నారు