కేసీఆర్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటారు

Published: Thursday February 18, 2021
మేడిపల్లి, ఫిబ్రవరి17 (ప్రజాపాలన) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా "గ్రీన్ ఇండియా ఛాలెంజ్" లో బాగంగా పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని పర్వతాపూర్ సాయిప్రియా నగర్ కాలనీలో మేయర్ జక్క వెంకట్ రెడ్డి మరియు 3వ డివిజన్ కార్పొరేటర్ బైటింటి శారద ఈశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో  కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున మొక్కలను నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర కార్మిక & ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి మరియు మాజీ శాసన సభ్యులు, తెరాస పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి మలిపెద్ది సుధీర్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటి కేసీఆర్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసినారు. అనంతరం అతిధులు మాట్లాడుతూ ప్రపంచం ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్ర పుటల్లో కేసీఆర్ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుందని, తెలంగాణ ప్రజల ఆకాంక్ష స్వరాష్ట్రం సాధించిన తీరు, పాలనలో తీసుకువచ్చిన పథకాల గురించి వివరించి తెలంగాణ సాధకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కాలనీ వాసులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.