ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమార్చన కార్యక్రమం

Published: Tuesday October 04, 2022
బోనకల్ అక్టోబర్ 3 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలో గల గిరిజన కాలనీలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన తొమ్మిదవ రోజు శ్రీ దుర్గా దేవి నవరాత్రులు సందర్భంగా సోమవారం స్థానిక మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన పూజ నిర్వహించారు. సోమవారం చివరి రోజు సద్దుల బతుకమ్మ కావడంతో మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మలు తయారు చేస్తున్నారని ఫ్రెండ్స్ యూత్ కమిటీ సభ్యులు తెలియజేశారు. నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి విరాళాలు రూపంలో సహకరించిన భక్తులందరికీ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన కాలనీలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో కొలువై ఉన్న శ్రీ దుర్గా మాత అమ్మవారు ఈ నెల 8వ తారీకు శనివారం రోజు సాయంత్రం 6 గంటల నుండి అంగరంగ వైభవంగా ఉత్సవ ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. ఊరేగింపు కార్యక్రమానికి మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కమిటీ సభ్యులు కోరారు.