ఏవి ఇన్ఫోప్రైడ్ అసోసియేషన్ అధ్యక్షులుగా : వై రమేష్ రెడ్డి

Published: Tuesday July 13, 2021
మేడిపల్లి, జులై 12 (ప్రజాపాలన ప్రతినిధి) : ఏవి ఇన్ఫోప్రైడ్ గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా వై రమేష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని మేడిపల్లి యందు 210 ప్లాట్లతో నిర్మాణమైన ఏవి ఇన్ఫోప్రైడ్ గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు మేయర్ జక్క వెంకట్ రెడ్డి  సమక్షంలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో రెండు వర్గాలు పోటి పడే అవకాశం ఉందని అందరూ ఊహించినప్పటికీ అందుకు సరిపడా తగినంత సంఖ్యా బలం లేకపోవడంతో వై రమేష్ రెడ్డి అధ్యక్షత వహిస్తున్న ప్యానల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. అధ్యక్షులుగా వై రమేష్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఆర్ వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కె తిలక్ బాబు, సంయుక్త కార్యదర్శులుగా జి లక్ష్మీ రెడ్డి, ఎన్ కృష్ణ రెడ్డి, కోశాధికారిగా డి సుధాకర్, కార్య నిర్వాహకులు ఆర్ రామ్ సుషీల్, కమిటీ సబ్యులు మాస రమేష్, ఎం మల్లయ్య, ఎస్ మల్లేష్ గౌడ్, పి సురేష్, కుమార్, కె బాల్ రెడ్డి, టి సత్యనారాయణ రెడ్డి, బి లవన్, నీలం కిషోర్, సునీల్ బాబు నీలం వి సెల్వరాజ్ లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు వై రమేష్ రెడ్డి మాట్లాడుతూ ఏవి ఇన్ఫోప్రైడ్ లో అందరూ ఒకే కుటుంభం మాదిరిగా కలిసి ఉంటూ, ఎవరికీ ఎలాంటి సమస్య ఏర్పడినా తక్షణమే స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. మేయర్ జక్క వెంకట్ రెడ్డి నూతనంగా ఎన్నికైన కమిటీ సబ్యులకు అభినందలు తెలియజేయడంతో పాటు ఎలాంటి పొరపచ్చాలకు తావులేకుండా ఆదర్శ కమ్యూనిటీగా తీర్చిదిద్దేందుకు ప్యానల్ సబ్యులందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు.