బాలాపూర్ లడ్డు దక్కించుకున్న వారికి శుభాకాంక్షలు... మంత్రి

Published: Tuesday September 21, 2021
బాలాపూర్, సెప్టెంబర్ 20, ప్రజాపాలన ప్రతినిధి : ప్రపంచవ్యాప్తంగా విశిష్టమైన చరిత్ర ప్రసిద్దిగాంచిన బాలాపూర్ గణేషు లడ్డు ను వేలం పాటలో కైవసం చేసుకున్న నాదర్గుల్ నివాసి మర్రి శశాంక్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పొద్దుటూరు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ లు సోమవారం నాడు బషీర్ బాగ్ లోని విద్యా శాఖ మంత్రి కార్యాలయంలో మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి ని కలిసి బాలాపూర్ మహా గణనాథుని లడ్డు ప్రసాదాన్ని అందజేసారు. ఈ సందర్భంగా వారికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు టిఆర్ఎస్ నాయకులు చిట్టెపు మల్లారెడ్డి పాల్గొన్నారు.