ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 28 ప్రజాపాలన ప్రతినిధి * అండర్ డ్రైనేజ్ పనులను ప్రారంభించిన జడ్పిట

Published: Tuesday November 29, 2022
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండల పరిధిలోని లింగంపల్లి గ్రామంలో  గ్రామపంచాయతీ నిధులు మరియు ఎంపిటిసి  నిధులతో ఈరోజు  అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంచాల జడ్పిటిసి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి  ఈ సందర్భంగా లింగంపల్లి గ్రామంలో పర్యటించిన జడ్పిటిసి త్వరలో జిల్లా పరిషత్ నిధులు మంజూరు చేయించి విడతలవారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు, మంచాల మండలం అన్ని గ్రామాల్లో  మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు,అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నమని తెలిపారు, ఈ కార్యక్రమంలో  ఎంపీటీసీ జయానందం,సర్పంచ్ పెర్క వినోద మూర్తి.వార్డు మెంబర్లు ఐలయ్య, సుదర్శన్ రెడ్డి, కిష్టయ్య,  గ్రామస్తులు శ్రీనివాసరెడ్డి, బూర శివగౌడ్, మహేష్, రాజిరెడ్డి, కాలనీ వాసులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.