యస్సార్ తెలంగాణ పార్టీ మండల కమిటీలు ఏర్పాటు

Published: Friday November 18, 2022
మధిర నవంబర్ 17 (ప్రజా పాలన ప్రతినిధి) వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మధిర నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు నూతన అధ్యక్షులను మధిర నియోజకవర్గ కో ఆర్డినేటర్ మద్దెల ప్రసాదరావు సూచనలు ప్రకారం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆదేశాల ప్రకారం జిల్లా అధ్యక్షులు లక్కినేని సుధీర్ నియమించారు. శుక్రవారం నూతనంగా నియామకమైన మండల అధ్యక్షులకు నియామకపు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా నియామకమైన మండల అధ్యక్షులు వైయస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు లక్కినేని సుధీర్ నియోజకవర్గం కోఆర్డినేటర్ డాక్టర్ మద్దెల ప్రసాద రావుని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేసేందుకు నూతన కమిటీలు కష్టపడి పని చేయాలని వారు సూచించారు. ప్రతి గ్రామంలో గ్రామ మరియు బూత్ కమిటీలను ఏర్పాటు చేయాలని వారు కోరారు. మండల అధ్యక్షులుగా నియామకమైన వారిలో
మధిర మండల అధ్యక్షులుగా ఐలూరి ఉమామహేశ్వర రెడ్డి ఎర్రుపాలెం మండల అధ్యక్షులుగా వేమిరెడ్డి మల్లారెడ్డి బోనకల్లు మండల అధ్యక్షుడుగా షేక్ మౌలానా చింతకాని మండల అధ్యక్షుడుగా వాకా వీరారెడ్డి ముదిగొండ మండల అధ్యక్షుడుగా సామినేని రవి తదితరులు ఉన్నారు.