15వ డివిజన్లో 29.70 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభోత్సవం

Published: Thursday August 19, 2021
మేడిపల్లి, ఆగస్టు18 (ప్రజాపాలన ప్రతినిధి) పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 15వ డివిజన్ విహరిక కాలనీలో స్థానిక కార్పొరేటర్ బండారి మంజుల రవీందర్, మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ లతో కలిసి కార్మికశాఖ మంత్రివర్యుల చామకూర మల్లారెడ్డి మున్సిపల్ సాధారణ నిధులు రూ 29.70లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కార్పొరేషన్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎంపల్ల అనంత్ రెడ్డి, దొంతిరి హరిశంకర్ రెడ్డి, బచ్చ రాజు, కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షులు దర్గా దయాకర్ రెడ్డి, డివిజన్ కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.