ముదిరాజ్ సంగం నూతన కమిటీ ఎన్నిక

Published: Tuesday October 25, 2022

ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 23ప్రజాపాలన ప్రతినిధి రంగారెడ్డి జిల్లా  యాచారం మండలంలోని నందివనపర్తి గ్రామంలో ముదిరాజ్  సంఘం నూతన కమిటీని ముదిరాజ్ మహాసభ యాచారం మండల అధ్యక్షులు నీలం శ్రీకాంత్ ముదిరాజ్  ఆధ్వర్యంలో నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముదిరాజ్ సంగం గ్రామ శాఖ అధ్యక్షుడిగా సామ బాలకృష్ణ ముదిరాజ్ , ఉపాధ్యక్షుడిగా గుణమోని రాఘవేందర్ ముదిరాజ్ , మేకం బాలరాజ్ ముదిరాజ్ ,  ప్రధాన కార్యదర్శి గుణమోని గణేష్ లతో పాటు పూర్తి స్థాయి కమిటీని నియమించారు. ఈ సందర్భంగా సామ బాలకృష్ణ ముదిరాజ్ మాట్లాడుతూ తమపై ఎంతో నమ్మకం పెట్టుకొని ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో ముదిరాజ్ సంఘ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం నూతన కమిటీని సత్కరించారు. కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో భాషమొని యాదగిరి ,గుణమోని యాదగిరి ,నూకం హరిప్రసాద్ ,నుకం రామస్వామి,
సామ వెంకటేష్ ,భాషమోని ఈశ్వరయ్య,
ఎడ్ల రజినీకాంత్ ,సామ పవన్,సామ మల్లేష్ ,
నూకం కృష్ణ, ముదిరాజ్ సంగం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.