ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడిగా గడ్డ నాగేశ్వరరావు

Published: Monday September 19, 2022
బోనకల్, సెప్టెంబర్ 18 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని ముష్టికుంట్ల గ్రామ ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షునిగా గడ్డ నాగేశ్వరావు ని జిల్లా కోపరేటివ్ అధికారి నియమించడం జరిగింది. ఇప్పటిదాకా పదవీకాలం చేసిన కొంగర వెంకటనారాయణ రాజీనామా చేయడంతో ఖాళీగా ఉన్న అధ్యక్ష స్థానాన్ని ఉపాధ్యక్షుడు అయినా దొడ్డ నాగేశ్వరావు ని అధ్యక్షునిగా నియమించినారు. ఈ నియమాకానికి పట్ల టిఆర్ఎస్ అధ్యక్షుడు మండల అధ్యక్ష ,కార్యదర్శులు చేబ్రోలు మల్లికార్జునరావు, మోదుగుల నాగేశ్వరావు, మండల సీనియర్ నాయకుడు బంధం శ్రీనివాసరావు ,ముష్టికుంట్ల గ్రామ సర్పంచ్ షేక్ బీజాంబి, హుస్సేన్, మధిర మార్కెట్ డైరెక్టర్లు కొనకంచి నాగరాజు, షేక్ బాబు ,రైతుబంధు ముష్టికుంట్ల కోఆర్డినేటర్ పండగ సీతారాములు, మండల కార్మిక సంఘం అధ్యక్షులు బంధం నాగేశ్వరావు ,మైనార్టీ మండల అధ్యక్షుడు షేక్ ఇబ్రహీం ,మండల యువజన అధ్యక్షుడు షేక్ నజీర్, టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్ష కార్యదర్శులు దుప్ప కృష్ణ, షేక్ రఫీ అభినందించినారు.