పిల్లలతో కలిసి మొక్కలు నాటిన మంత్రి మల్లారెడ్డి మేడిపల్లి, జూన్ 26 (ప్రజాపాలన ప్రతినిధి)

Published: Monday June 27, 2022
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 8వ విడిత హరితహరం కార్యక్రమంలో భాగంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి శాంతివనం పార్క్ లో పిల్లలతో కలిసి కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మేయర్ జక్క వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లు డాక్టర్ కేతావత్ సుభాష్ నాయక్, కుర్ర శాలిని శ్రీకాంత్ గౌడ్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, 2వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పగడాల బాల్ రాజ్, ప్రధాన కార్యదర్శి వరికల శ్రీనివాస్, కాకతీయ నగర్ కాలనీ ప్రధాన కార్యదర్శి జోగిని జహంగీర్, వార్డ్ ఆఫీసర్ గోవింద్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు రాధాకృష్ణ, శ్రీరామోజు శంకర్ చారి, రాజన్న, శ్రీనివాస్ గౌడ్,శివ తదితరులు పాల్గొన్నారు.