శ్రీ దివ్య షిరిడి సాయిబాబా మందిర మునందు సాయి ప్రసాదం అన్నదానం వితరణ
మధిర ఫిబ్రవరి 10 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో సాయిబాబా సన్నిధిలో దాతల సహకారంతో గురువారం నాడు అన్నదాన వితరణ భాగంగా శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, మాఘ మాసంమాఘ మాసం శ్రీ దివ్య షిర్డీ సాయిబాబాదేవాలయం మందిరము నందు సాయి ప్రసాదం దాతలు వంకాయలపాటి దివ్యశ్రీ ఈదర నరేష్, మచ్చా శ్రీనివాస్ రావు సంక్రాంతి వెంకటేశ్వరరావు, సుజాత కేతేపల్లి సాయి లక్ష్మి హంసలేఖ జ్ఞాపకార్థం పవన్ కుమార్ అన్న ప్రసాదం వితరణ చేసినారు అనంతరం దాతలు ఈ సందర్భంగా మాట్లాడుతూ సాయి సన్నిధిలో అన్నదానం చేయటం అన్నం పరబ్రహ్మ స్వరూపం పేదలకు అన్నదానం చేయడం వల్ల సాయి కృప అందరికీ ఉండాలని తెలిపారు గురువారం సాయంత్రం పల్లకి సేవ కార్యక్రమం సాయి భజన కార్యక్రమం జరుగుతుందని ఆలయ కమిటీ వారు తెలిపారు శ్రీ దివ్య షిరిడి సాయిబాబా భక్తులు, పబ్బతి నాగేశ్వరరావు, సత్యవతి, భక్తులుచే అన్నదాన వితరణ చేసినారు మరియు కమిటీ సభ్యులు, ఆచార్యులు పాల్గొన్నారు
Share this on your social network: