తక్కెళ్ళపాడు గ్రామంలో వివాహిత హత్య
Published: Wednesday September 01, 2021
ఎరుపాలెం, ఆగస్టు 31, ప్రజాపాలన ప్రతినిధి : ఎర్రుపాలెం మండలం కేంద్రంలోని తక్కెళ్ళపాడు గ్రామంలో వివాహిత హత్య. వివరాల్లోకి వెళితే ఎర్రుపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన రావూరి జమలయ్య కుమార్తె మరియమ్మకు తక్కలపాడు కు చెందిన గట్టి గుండె ఏసోబు సంవత్సరంన్నర క్రితంవీరికి వివాహమైంది. ఈమె వయసు 30 సంవత్సరాలు. భర్తకి ఇది రెండో సంబంధం. మొదటి భార్యకు ఒక బాబు ఉన్నాడు ఆ బాబు కి ఎనిమిది సంవత్సరాలు. అయితే రాఖీ పండుగ సందర్భంగా భార్యాభర్తలిద్దరూ తక్కెళ్ళపాడు గ్రామానికి వచ్చారు. అదే రోజు రాత్రి ఆమె ఉరి వేసుకుంది. భర్తను వివరాలు అడిగితే తెల్లవారేసరికి ఉరివేసుకుని ఉంది అని చెప్పాడు. ట్రైనీ ఎస్ఐ వెంకటేష్ కథనం మేరకు విచారణ చేసి దర్యాప్తు చేస్తామన్నారు. వివరాలు ఇంకా తెలియరాలేదు. కార్యక్రమంలో హెడ్కానిస్టేబుల్ ఇక్బాల్, కానిస్టేబుల్ లో కృష్ణమోహన్ వెంకటేశ్వరరావు శ్రీనివాసు పాల్గొన్నారు
Share this on your social network: