డివిజన్లో మౌలిక వసతుల కల్పనకు కృషి కార్పొరేటర్ రమా వెంకటేష్ యాదవ్

Published: Friday August 06, 2021
మేడిపల్లి, ఆగస్టు5 (ప్రజాపాలన ప్రతినిధి) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 24వ డివిజన్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని స్థానిక కార్పొరేటర్ గుర్రాల రమ వెంకటేష్ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు డివిజన్లోని గణేష్ నగర్, ఇంద్రానగర్లో కొంత భాగంలో నూతన డ్రైనేజీ పైప్ లైన్ పనులను కార్పొరేటర్ గుర్రాల రమా వెంకటేష్ యాదవ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్లోని అన్ని కాలనీలో డ్రైనేజీ, రోడ్లు, పార్కులను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గణేష్ నగర్ కాలనీ అధ్యక్షులు తోట కృష్ణ, ప్రధాన కార్యదర్శి సి. కృష్ణ, మహిళలు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.