ఎం ఎల్ ఎ ల కొనుగోలు వ్యవహారం బీజేపీ దిగజారుడు తనానికి నిదర్శనం : మాజీ కార్పొరేటర్ శేషు కుమారి.

Published: Friday October 28, 2022

ఎం ఎల్ ఎ ల కొనుగోలు వ్యవహారం వెనక బీజేపీ నాయకత్వం ఉందని ఆరోపిస్తూ సనత్ నగర్ నియోజకవర్గంలో అమీర్ పేట్ డివిజన్ లో సత్యం థియేటర్ దగ్గర గురువారం మాజీ కార్పొరేటర్ శేషు కుమారి,తెరాస నాయకుల ఆధ్వర్యంలో అమిత్ షా, బిజెపి పార్టీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ శేషు కుమారి  మాట్లాడుతూ కులాన్ని, మతాన్ని వాడుకుంటూ  రాజకీయడం చేయడం బిజెపికి అలవాటుగా మారిందని, మునుగోడులో రాజకీయ అలజడి సృష్టిద్దామని స్వామీజీలని ఉపయోగించి రాజకీయం చేద్దామని బీజేపీ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారన్నారు. స్వామీజీల పేరుతో బహిరంగంగా  తోటి రాజకీయ నాయకులను డబ్బులు ఎరవేసి కొనుగోలు చేయడం ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. హిందూ సమాజాన్ని  బిజెపి పార్టీ  ఏమేరకు దిగజార్చిందో తెలపడానికి ఈ సంఘటన ఒక గొప్ప ఉదాహరణ అన్నారు. రాజకీయ  ప్రచారంలో ఆర్ఎస్ఎస్ ని వాడుతున్నారని,రాజకీయ నాయకులను కొనడానికి స్వామీజీలను వాడుతున్నారని,ఇంత నీచ స్థితికి దిగడానికి బిజెపి పార్టీ సిద్దమయింది అని ఆమె మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో అమీర్పేట్ డివిజన్. అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ శేషు కుమారి తో పాటు అశోక్ యాదవ్, హనుమంతరావు,కరుణాకర్, ప్రవీణ్ రెడ్డి, గులాబ్ సింగ్, కూతురు నరసింహ ,సత్యనారాయణ యాదవ్, కట్ట బలరాం,హరి సింగ్ యాదవ్, సంపత్, రాజు, లక్ష్మి, విజయ దుర్గ,లత,అనిత,అరుణ, రాణి కౌర్, జ్యోతి తదితర టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.