సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు

Published: Thursday July 22, 2021
మధిర, జులై 21, ప్రజాపాలన ప్రతినిధి : మరియు మండల పరిధిలో బాలసాని లక్ష్మీనారాయణ గారి సిఫార్సు తో, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు చొరవతోమంజూరైన మధిర, మాటూరు నాగవరప్పాడు సిరిపురం ఇల్లూరు గ్రామాలకు చెందిన 1,56,000/- రూపాయల విలువ చేసే 7 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను లబ్ధిదారులకు అందజేసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ఈసందర్భంగా మాట్లాడుతూ వివిధ రకాల అనారోగ్యాల కారణంగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొంది, ఆ బిల్లులను సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న సందర్భంలో సీఎం సహాయనిధి నుండి పెద్ద ఎత్తున చెక్కులను మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, గొప్ప మనసుతో తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి మనమందరం అండగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తూరు నాగేశ్వరరావు, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షులు దేవిశెట్టి రంగా రావు, పట్టణ కార్యదర్శి అరిగె శ్రీనివాసరావు, టిఆర్ఎస్ నాయకులు కనుమూరి వెంకటేశ్వరరావు, వీర వెంకట రెడ్డి, కరివేద సుధాకర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అప్పారావు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ చావా వేణు, శివాలయం కమిటీ చైర్మన్ వంకాయలపాటి నాగేశ్వరరావు, తోగరు ఓంకార్, ఎర్రగుంట రమేష్, జేవీ రెడ్డి, గుగులోతు కృష్ణ, పలు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.