జిల్లా ఏరియా ఆసుపత్రిలో దివ్యాంగుల వైద్య పరిక్ష శిబిరాలు
Published: Wednesday June 29, 2022
జన్నారం రూరల్, జున్ 28, ప్రజాపాలన: మంచిర్యాల ఏరియా ఆసుపత్రిలో దివ్యాంగుల పరిక్ష శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి అరుణరాణి అన్నారు. మంగళవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ దివ్యాంగులు ద్రవీకరణ పత్రమును పొందుటకు మీ సేవాలో స్లాట్ బుక్ చేసుకుని నిర్ణీత తేదీలలో స్థానిక ఏరియా ఆస్పిటల్ లో డాక్టర్ ను సంప్రదించాలన్నారు, మంచిర్యాల ఏరియా ఆసుపత్రిలో జూలై ఐదవ తేది నుంచి సెప్టెంబర్ ఇరువై తొమ్మిది తారీఖు వరకు దివ్యాంగులకు వైద్య పరీక్ష శిబిరాలు నిర్వహించాబడను, గతంలో పొందిన సదరం సర్టిఫికేట్ యెుక్క పరిమితి కాలము పూర్తి అయిన వారు రేనువాల్ కోరకు నూతనంగా సర్టిఫికేట్ కావలసిన వారు మీ సేవ సెంటర్ లో స్లాట్ బుక్ చేసుకోవడానికి దివ్యాంగులకు అవకాశం సల్పించనైనదని అమె తెలిపారు.
Share this on your social network: