రాష్ట్ర బిజెపి కార్యదర్శి రఘునందన్ రావును కలిసిన వికారాబాద్ నాయకులు

Published: Friday May 07, 2021
వికారాబాద్ మే 06 ప్రజాపాలన బ్యూరో : ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి కోస్గి వెళ్తున్న రాష్ట్ర బిజెపి కార్యదర్శి, దుబ్బాక శాసన సభ్యుడు రఘునందన్ రావును వికారాబాద్ బిజెపి నాయకులు మన్నెగూడలో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివ రాజు, సీనియర్ నాయకులు మాధవ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు తూర్పు రాజేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. అకాల వర్షాలతో కూరగాయలు, మామిడి పంట పూర్తిగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.