కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన చైర్మన్ ప్రదీప్ రెడ్డి..

Published: Tuesday November 29, 2022
తల్లాడ, నవంబర్ 28 (ప్రజాపాలన న్యూస్): 
 రైతులు ధాన్యం  కొనుగోలు కేంద్రాన్ని  సద్వినియోగం చేసుకోవాలని కుర్నవల్లి సొసైటీ చైర్మన్ అయిలూరి ప్రదీప్ రెడ్డి అన్నారు . సోమవారం కుర్నవల్లి సొసైటీలో కొనుగోలు కేంద్రాన్ని  ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని మేలైన ధాన్యాన్ని ఏ ఈ ఓ ద్వారా ధ్రువపత్రం పొంది సొసైటీలో  కొనుగోలు కేంద్రం వద్ద అమ్ముకోవాలన్నారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం కొనుగోలు కేంద్రంలో అమ్ముకొని 
 మద్దతు ధర పొందాలన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అయిలూరి లక్ష్మి, ఉప సర్పంచ్ పోతురాజు వెంకటయ్య, అయిలూరిపెద్ద వెంకటరెడ్డి, అయిలూరికృష్ణారెడ్డి, అయిలూరి శివారెడ్డి పాల్గొన్నారు.