జాతీయ జెండాను ఎగరవేసిన సర్పంచ్ మమత..
Published: Friday January 27, 2023
తల్లాడ, జనవరి 26 (ప్రజా పాలన న్యూస్):
74 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం అన్నారుగూడెం గ్రామంలో గ్రామ సర్పంచ్ మారెళ్ళ మమత జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వేడుకలను ప్రతి ఏడాది జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అతిపెద్దదని, అలాంటి రాజ్యాంగాన్ని అమలు చేసి మనకు అందించిన మహానుభావులను ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గోవిందు విజయమ్మ, ఉపసర్పంచ్ గోవిందు భాగ్యమ్మ, సెక్రటరీ వేణు, విడిసి చైర్మన్ మారెళ్ళ మల్లికార్జునరావు, మాజీ ఎంపీటీసీ తాళ్ల జోసెఫ్, నాయకులు తుమ్మలపల్లి రమేష్, పొన్నం కృష్ణయ్య, అపతి వెంకట రామారావు, గోవిందు నరసింహారావు, పులి వెంకట నరసయ్య, దుగ్గినేని గోపయ్య, యాకూబ్ పాషా, అంగన్వాడి టీచర్లు, ఆశ కార్యకర్తలు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.*
Share this on your social network: