జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పలువురు పరామర్శ

Published: Monday April 18, 2022

మధిర ఏప్రిల్ 17 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు వివిధ కుటుంబాలను పరామర్శించిన జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మరణించిన కొడెం సారంగపాణి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు రామిశెట్టి రోశయ్య సతీమణి రామిశెట్టి హైమావతి గత కొన్ని రోజుల క్రితం మరణించడంతో వారి కర్మకు హాజరై చిత్ర పటానికినివాళి అర్పించి సీనియర్ నాయకులు రోశయ్యని పరామర్శించారు ఈ కార్యక్రమంలో పట్టణ వివిధ హోదాల్లో ఉన్న తెరాస పార్టీ నాయకులు కనుమూరి వెంకటేశ్వరావు రామారావు అప్పారావు వార్డు కౌన్సిలర్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు