తెరాస కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

Published: Wednesday September 22, 2021
బీరుపూర్, సెప్టెంబర్ 21, ప్రజాపాలన ప్రతినిధి : బీరుపూర్ మండల్ కొల్వాయి గ్రామానికి చెందిన తెరాస కార్యకర్త గుండ సురేష్ కుమారుడు లోకేష్ అనారోగ్యంతో బాధపడుతు మరణించడంతో వారి కుటుంబ సభ్యులను స్థానిక ఎమ్మెల్యే డా:సంజయ్ కుమార్ పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేసి కుటుంబానికి భరోసా ఇచ్చి ఓదార్చారు. ఎమ్మెల్యే వెంట స్థానిక కౌన్సిలర్ కూసరి అనిల్ పృథ్వీదర్ రావు రమేష్ రావు తదితరులు ఉన్నారు.