అంగన్వాడి పిల్లలు అక్షర బ్యాసం చేయించిన సర్పంచ్

Published: Friday November 18, 2022
బోనకల్, నవంబర్ 17 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని ఆళ్లపాడు అంగన్వాడీ 1వ కేంద్రంలో గురువారం సర్పంచ్ మర్రి తిరుపతిరావు అంగన్వాడి పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మర్రి తిరుపతి రావు మాట్లాడుతూ మేను ప్రకారం పిల్లలకు కావలసిన పోషక పదార్థాలు అందించాలని, అంగన్వాడి కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అంగన్వాడి టీచర్ కు తెలియజేశారు. అనంతరం పిల్లలకు పాలు, గుడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మర్రి తిరుపతి రావు, అంగన్వాడీ టిచర్ గౌరమ్మ, అయా పిల్లలు పాల్గొన్నారు.