ఘనంగా ఎమ్.పి. వెంకటేష్ నేత జన్మదిన వేడుకలు

Published: Friday June 17, 2022
మంచిర్యాల టౌన్, జూన్ 16, ప్రజాపాలన: ఓయూ ఆర్ట్స్ కళాశాల వేదికగా జన హృదయ నేత, పేదప్రజల ఆశాజ్యోతి, విద్యార్థుల స్ఫూర్తి ప్రదాత, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు డా. బోర్లకుంట వెంకటేష్ నేత జన్మదిన వేడుకలు  గురువారం రోజున టి ఎన్ ఏమ్ వి ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సాయిని ప్రసాద్ నేత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జాడి మల్లయ్య ,రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ చీఫ్ ఇంజనీర్ శ్రీ ముడిమడుగుల శంకర్ లు పాల్గొని బర్త్ డే కేక్ ను కట్ చేసి మిఠాయిలు పంచారు.  
అనంతరం  వారు మాట్లాడుతూ వెంకటేష్ నేత విద్యాభ్యాసాన్ని, వారి గ్రూప్ 1 సాధించిన విధానాన్ని, ఆయన చేసిన సేవలను కొనియాడారు. భవిష్యత్తులో ఉన్నతమైన పదవులు అలంకరించి జాతికి సమాజానికి మరింత అండగా నిలవాలని కోరారు. 
ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర అధికార ప్రతినిధి దుర్గం వినోద్ కుమార్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ప్రశాంత్, రాష్ట్ర కమిటీ సభ్యులు శివ కార్తీక్, తదితర విద్యార్థి మిత్రులతో పాటు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.