అందరికీ కోవిడ్ వ్యాక్సినేషన్
Published: Friday August 20, 2021
మధిర, ఆగస్టు 19, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం, సిద్దినేని గూడెం గ్రామంలో గత రెండు రోజులుగా గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ కోట అంజమ్మ గారి ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీ ఆర్సిఎం చర్చి వద్ద నిర్వహించిన కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయినది. వ్యాక్సినేషన్ పూర్తి చేయుటలోభాగంగా రెండవ రోజు వరి పొలాల్లో నాటు వెయ్యటానికి వెళ్లిన కూలీలను పత్తి పంటలో కలుపు తీయుటకు వెళ్ళిన కూలీలను ట్రాక్టర్ల ద్వార వ్యాక్సినేషన్ శిబిరానికి తరలించి వ్యాక్సిన్ పట్ల ఉన్న అపోహలను తొలగించి, దాని యొక్క ఆవశ్యకతను వివరిస్తూ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ మొదటి డోసు అందే విధంగా తగిన చర్యలు తీసుకున్నారు. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేయుటకు సహకరించిన ఏఎన్ఎం మరియమ్మ గారిని మరియు ఆశ వర్కర్ లను గ్రామ సర్పంచ్ అభినందించారు. ఈ కార్యక్రమానికి గ్రామ పంచాయతీ సెక్రెటరీ, ఐకెపి సభ్యులు, గ్రామ వార్డు మెంబర్లు హాజరైనారు.
Share this on your social network: