ధర్మపురి అరవింద్ పై దాడికి నిరసన....

Published: Friday January 28, 2022
ఎర్రుపాలెం జనవరి 27 ప్రజాపాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై టిఆర్ఎస్ గుండాలు చేసిన దాడి పై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మండల అధ్యక్షులు ముక్కపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ బీజేపీ నాయకుల పై టిఆర్ఎస్ నాయకులు చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి  వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా సభ్యులు పుప్పాల చంద్రమౌళిలేశ్వర రావు, రామకృష్ణ గౌడ్, మల్లెల మోహన్రావు వేమా ఏడుకొండలు, మిరియాల నాగేశ్వరరావు, ఇత్తడి రమేష్, బొక్కరమేష్ శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.