ధర్మపురి అరవింద్ పై దాడికి నిరసన....
Published: Friday January 28, 2022
ఎర్రుపాలెం జనవరి 27 ప్రజాపాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై టిఆర్ఎస్ గుండాలు చేసిన దాడి పై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మండల అధ్యక్షులు ముక్కపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ బీజేపీ నాయకుల పై టిఆర్ఎస్ నాయకులు చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా సభ్యులు పుప్పాల చంద్రమౌళిలేశ్వర రావు, రామకృష్ణ గౌడ్, మల్లెల మోహన్రావు వేమా ఏడుకొండలు, మిరియాల నాగేశ్వరరావు, ఇత్తడి రమేష్, బొక్కరమేష్ శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.
Share this on your social network: