జనసేన పార్టీ ఆధ్వర్యంలో తల సేమియా బాధితులకి ఫ్రీ బ్లడ్ డొనేషన్ శిబిరం మధిర జూలై 7 ప్రజాపాలన ప

Published: Friday July 08, 2022

మధిరలో తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇంచార్జ్ శంకర్ గౌడ్  ఆదేశాల మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ రాము తాళ్లూరి  సూచన సలహాలతో ఖమ్మం జిల్లా నాయకులు సహాయంతో  తల సేమియా రక్త శిబిరం మధిర లో ఏర్పరచడం జరిగింది ఈ సందర్భంగా *జనసేన పార్టీ మధిర నియోజకవర్గ నాయకులు *తాళ్లూరీ డేవిడ్ మాట్లాడుతూ* సమస్య ఎక్కడుందో అక్కడ జనసేన ఉండాలని శ్రీ పవన్ కళ్యాణ్  ఏదైతే చెప్పారో అదే విధంగా  ఖమ్మం జిల్లాలో 300 మంది తల సేమియా బాధితులు ఉన్నారు వారికి 15 రోజులకు ఒకసారి వారికి రక్తం ఎక్కించకపోతే ప్రాణాలకు ప్రమాదం జరుగుతుంది కావున మధిర నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు శ్రీ పవన్ కళ్యాణ్అభిమానులు రక్త శిబిరానికి వచ్చి తల సేమియా వ్యాధితో బాధపడుతున్న బాధితులకి రక్తం ఇచ్చి వారి ప్రాణాలను కాపాడతారని రక్తం ఇచ్చి పేరు నమోదు చేసుకోగలరని మనస్ఫూర్తిగా మధిర నియోజకవర్గ జనసేన పార్టీ తరపున కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో గద్దల వంశీ గద్దల పవన్ గార్లపాటి రవి, వరుణ్ తదితరులు పాల్గొన్నారు