అమీర్ పేటలో మూడు రోజుల ముందు నుండే ఘనంగా కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకలు

Published: Wednesday February 16, 2022
హైదరాబాద్(ప్రజాపాలన ప్రతినిధి) : ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకల్లో భాగంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాలతో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ వసతి సముదాయం దగ్గర పేదలకు, భక్తులకు అన్నదానం నిర్వహించారు మాజీ కార్పొరేటర్ శేషు కుమారి  మరియు డివిజన్ తెరాస నేతలు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శేషు కుమారి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె సి ఆర్ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని తెలంగాణను ఇంకా అభివృద్ధితో ముందుకు తీసుకువెళ్లాలని ఈ మూడు రోజులు మంత్రి తలసాని ఆదేశాల మేరకు అన్నదానం, హెల్త్ క్యాంప్, రక్త దాన శిబిరం మరియు అన్ని దేవాలయాల్లో పూజలు తదితర కార్యక్రమాలు ఈ మూడు రోజులూ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్సి హనుమంతరావు, సంతోష్, సీనియర్ నాయకులు అశోక్ యాదవ్, సత్యనారాయణ యాదవ్, నారాయణ రాజు, జితేందర్, సత్యనారాయణ, కట్ట బలరాం, లలిత చౌహాన్, గులాబ్ సింగ్, నేతలు రాజు ముదిరాజ్, శివ, శ్రీనివాస్ యాదవ్, వనం శ్రీనివాస్, జోగిందర్ సింగ్, చరణ్ జీత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.