తెలంగాణ రాష్ట్ర యాదవ ఆర్గనైజేషన్ అధ్యక్షులుగా మేకల శ్రీనివాస్ యాదవ్

Published: Saturday June 19, 2021
మేడిపల్లి, జూన్18 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర యాదవ ఐక్యత అభివృద్ధి ఆర్గనైజేషన్ అధ్యక్షులుగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్ల నివాసులైన మేకల శ్రీనివాస్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు యాదవ ఆర్గనైజేషన్ ఉద్య (యుడివైఎ) వ్యవస్థాపకరాలు మేక లలిత యాదవ్ తెలంగాణ రాష్ట్ర యాదవ ఆర్గనైజేషన్ అధ్యక్షులుగా మేకల శ్రీనివాస్ యాదవను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మేకల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో యాదవ్ కులస్థల ఐక్యత, అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో ఈ పదవిలో నియమించినందుకు యుడివైఎ ఉద్య వ్యవస్థాపకరాలు మేక లలిత యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు.