రాజ రాజ నరేంద్ర స్వామి శివాలయము నకు కిరీటము శేష పానుపు అందజేత

Published: Monday September 06, 2021
మధిర, సెప్టెంబర్ 05, ప్రజాపాలన ప్రతినిధి : మడుపల్లి రాజ రాజ నరేంద్ర స్వామి శివాలయము నకు సూరిశెట్టి వెంకయ్య  కుమారులు సూరి శెట్టిఅనంతయ్య, నాగేశ్వరరావు, శ్రీనివాస రావు మరియు భాస్కర రావు లు వారి కుమారులు కూతుర్లు మనవరాళ్లతో కలిసి వచ్చి స్వామివారికి నాలుగు కిలోల వెండి కిరీటము శేష పానుపు సుమారు నాలుగు లక్షల ఖర్చు గల ఆభరణములు గుడికి మునిసిపల్ వైస్ చైర్మన్ శ్రీమతి విద్యా లత వెంకటరెడ్డి, సతీష్ శర్మ, గారి చేతుల మీదుగా స్వామివారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో తొగరు ఓంకార్, మేడికొండ కిరణ్, వేల్పుల బుజ్జి, శీలం లింగారెడ్డి, చింతల వెంకటేశ్వర్లు నీలం కృష్ణమూర్తి తదితరులు పాల్గొని దాతల దాతృత్వం కొనియాడారు అదేవిధంగా దేవాలయము అభివృద్ధి పనుల నిమిత్తం ఇంకా ఎవరైనా దాతలు ఉంటే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు