ముస్లిం సోదరీమణులకు రంజాన్ తోఫాను పంపిణీ చేసిన కార్పొరేటర్

Published: Friday April 14, 2023
మేడిపల్లి, ఏప్రిల్ 13 (ప్రజాపాలన ప్రతినిధి)
రంజాన్ పండుగను పురస్కరించుకొని 
రామంతాపూర్ డివిజన్ ఇంద్రనగర్లోని
మస్జిద్, ఈ టౌహీడ్ మజీద్ లలో ముస్లిం సోదరీమణులకు స్థానిక కార్పొరేటర్  బండారు శ్రీవాణి వెంకట్రావు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మసీదుల కమిటీ సభ్యులు రహీమ్ బైగ్ ఎండీ ఖాసిం, ఎండీ జహంగీర్, హిదయత్ అలి, ఎండీ జాక్రియా, అబ్దుల్ రహీమ్, జాఫర్, బిజెపి నాయకులు పడిగం నగేష్ ,పరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.