ఘనంగా తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ

Published: Tuesday September 27, 2022

కోరుట్ల, సెప్టెంబర్ 26 (ప్రజాపాలన ప్రతినిధి):
తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ  జయంతి సందర్భంగా కోరుట్ల మండలం జోగన్ పల్లి  గ్రామంలో  కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఐలమ్మ విగ్రహావిష్కరణ చేశారు.  రజక సంఘ సభ్యులు ,గ్రామ ప్రజలు  బస్టాండ్ నుండి ఐలమ్మ విగ్రహం వరకు ఆడపడుచులు మంగళ హారతులతో, డి.జే పాటలతో  ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో  కోరుట్ల జడ్పిటిసి దారిశెట్టి లావణ్య రాజేష్, ఎంపీపీ తోట నారాయణ, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు వెంకట్రావు,  జోగన్ పల్లి గ్రామ సర్పంచ్ దుంపల నర్సు రాజ నర్సయ్య,  ఉప సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి , మరియు వివిధ గ్రామాల సర్పంచులు భీమారెడ్డి ,అంజయ్య, మంగ రాజేందర్ ,పిడుగు రాధా సందయ, గంగరాజు,  ఎంపీటీసీలు మాధురి గోపాల్, ప్రియాంక సురేష్,  మున్సిపల్ కౌన్సిలర్లు పద్మ రాజారెడ్డి, రుద్ర శ్రీనివాస్, నాగభూషణం, రజక సంఘం  నాయకులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.