ప్రజాపాలన కొడంగల్ ప్రతినిధి ఆగస్టు 21:

Published: Monday August 22, 2022
భీమ్ సంస్కృతిలో ఘనంగా పుట్టినరోజు - వేడుకలు   బొంరాస్ పేట్ మండలంలోని చిల్మల్ మైలారం గ్రామంలో "భీమ్ సంస్కృతి" లో భాగంగా అంబేద్కర్ యువజన సంఘం చిల్మల్ మైలారం కమిటి ఆధ్వర్యంలో   బర్ల మహేశ్వరి - యాదయ్య దంపతుల గారి కూతురు "వర్షిణి మొదటి పుట్టినరోజు వేడుకలు" బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో 
ఘనంగా జరగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా U. రమేష్ బాబు అధ్యక్షులు కోడంగల్ నియోజకవర్గం గారు, డప్పు శ్రీను బొంరాస్ పేట్ మండల ఇంచార్జీ గారు హాజరై 
  ప్రతి ఒక్క కుటుంబం ఇలాంటి కార్యక్రమము చేసుకోవాలని... "బాబాసాహెబ్ అంబేద్కర్" గారి ఆలోచన విధానం గురించి అవగాహన కల్పించి మహనీయుల ఆలోచన విధానం "భీమ్ సంస్కృతి" లో వర్షిణి గారితో కేకు కటింగ్ చేయించారు. ఇలాంటి కార్యక్రమం నిర్వహించినందుకు వర్షిణి కుటుంబ సభ్యులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో  నియోజకవర్గం కమిటి సభ్యులు, G అశోక్, రమేష్, బొంరాస్ పేట్ పట్టణ అధ్యక్షులు మహేష్, మాజీ అధ్యక్షులు సాయిలు, పోస్ట్ మాన్ వెంకటయ్య, చిల్మల్ మైలారం కమిటి సభ్యులు, DSP బొంరాస్ పేట్ మండల అధ్యక్షులు నిఖిల్ మహారాజ్ మరియు అంబేద్కర్ వాదులు బహుజన వాదులు మహిళలు వర్షిణి బంధువులు తదితరులు పాల్గొన్నారు.