చిన్నారులను ఆశీర్వదించిన డాక్టర్ మట్టా దయానంద్

Published: Thursday July 07, 2022
తల్లాడ, జులై 7 (ప్రజాపాలన న్యూస్):

తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామానికి చెందిన బయ్యారపు గోపాలరావు, ధర్మవతి  కుమార్తెలు స్పందన, రిషిత పుష్పాలంకరణ కార్యక్రమం బుధవారం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సత్తుపల్లి నియోజకవర్గ తెరాస నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, గ్రామ సర్పంచ్ మారెళ్ళ మమత హాజరై చిన్నారులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అనంతరం ఇరువురు పేదలకు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వరరావు(కే వీ), గణేశుల రవి, తుమ్మలపల్లి రమేష్, పొన్నం కృష్ణయ్య ,షేక్ యాకుబ్ పాషా, కోసూరి రామారావు,కూచిపూడి వెంకటయ్య, గుమ్మవలరాజు తదితరులు పాల్గొన్నారు.