అనాధఆశ్రమానికి ఆదిభట్ల న్యూ కానిస్టేబుల్స్ చేయూత

Published: Friday February 05, 2021
బాలాపూర్: ప్రజాపాలన న్యూస్;
ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నూతనంగా ఉద్యోగం చేరినటువంటి  కొత్త బ్యాచ్ కానిస్టేబుల్స్ అందరుకలిసి. బుధవారం నాడు వారి మొదటి నెల జీతం నుండి మాతృదేవోభవ అనాధాశ్రమంలోని మానసిక వికలాంగులకు ఆదిబట్ల సి.ఐ పి.నరేందర్ సమక్షంలో అభాగ్యులకు అన్నదానం తో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆదిభట్ల సీఐ నరేందర్ మాట్లాడుతూ.... మా స్టేషన్లో  ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థకు నిదర్శనంగా ఇంత మంచి కార్యక్రమన్ని నిర్వహించినటువంటి నూతన పోలీస్ సిబ్బందిని  అభినందించారు.అదేవిధంగా అభాగ్యులను చేరదీసి సేవా కార్యక్రమలను నిర్వహిస్తున్న మాతృదేవోభవ అనాధాశ్రమం  ఫౌండర్ గట్టు గిరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈనాటి  కాలంలో సొంత కుటుంబ సభ్యులు కూడ చూడనటువంటి ఈ రోజుల్లో ఇంత మంది అభాగ్యులకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని  కొనియాడారు. వ్యవస్థాపకులు మాట్లాడుతూ.... మానవసేవే మాధవసేవగా భావిస్తూ ప్రతి ఒక్కరూ సమాజంలో "మన" అనే పదాన్ని అర్థం పరమార్థంగా భావించి, "నేను" అనే పదానికి ప్రతి ఒక్కరు లో స్వార్థం పోవాలని కోరుకుంటు ఈ సేవలను చేస్తున్నాను నీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిభట్ల నూతన పోలీస్ సిబ్బంది, అనాధాశ్రమం అభాగ్యులు, వ్యవస్థాపకులు గట్టు గిరి, తదితరులు పాల్గొన్నారు.