బాదం మొక్క నాటిన గ్రంథాలయ చైర్మన్ సనగారి కొండల్ రెడ్డి

Published: Thursday February 18, 2021

వికారాబాద్ జిల్లా ప్రతినిధి 17 ( ప్రజాపాలన ) : సిఎం కేసిఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్ర గ్రంథాలయం సమీపంలో బాదం మొక్క నాటనని చైర్మన్ సనగారి కొండల్ రెడ్డి అన్నారు. బుధవారం సిఎం కేసిఆర్ జన్మదినం సందర్భంగా ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ చాలెంజ్ లో భాగంగా కోటివృక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వృక్ష సంపద ఉంటే ఆరోగ్యానికి ఢోకా ఉండదని తెలిపారు. పచ్చని వృక్ష సంపదతో వెలుగొందేటట్లు గ్రంథాలయాన్ని తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. వృక్షాలతో స్వచ్ఛమైన ఆక్సీజన్ లభిస్తుందని చెప్పారు. సిఎం కేసిఆర్ కలకాలం ఆయరారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. మునుముందు మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, మాజీ జడ్పిటిసి ముత్తహర్ షరీఫ్, అశోక్ ముదిరాజ్, గ్రరంథాలయం సిబ్బబంది  తదితరులు పాల్గొన్నారు.