ఈటల రాజేందర్ కుటుంబానికి యువనేత బీపీ నాయక్ పరామర్శ
Published: Friday August 26, 2022
బోనకల్, ఆగస్టు 25 ప్రజా పాలన ప్రతినిధి: హుజురాబాద్ ఎమ్మెల్యే, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, బిజెపి రాష్ట్ర జాయినింగ్స్ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ తండ్రి ఈటెల మల్లయ్య(104) మరణించారని తెలుసుకున్న బిజెపి యువనేత బీపీ నాయక్, స్థానిక బిజెపి రాష్ట్ర నాయకులతో కలిసి హుటాహుటిన ఈటెల రాజేందర్ స్వగ్రామం అయిన హన్మకొండ జిల్లా కమలాపూర్ చేరుకొని వారి తండ్రి కి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఈటల రాజేందర్ తో భేటీలో వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా బీపీ నాయక్ మాట్లాడుతూ ఈటెల రాజేందర్ దృఢంగా ఉండాలని బీజేపీ నాయకులు కార్యకర్తలు అయిన మేము ఆయనకు అండగా ఉన్నామని భరోసా ఇచ్చారు.
Share this on your social network: